ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, డిసెంబర్ 2018, మంగళవారం

PaytmApp లో అదనపు చార్జీ లేకుండా రైలు టికెట్ బుకింగ్ చేసుకొనే విధానం


Paytm మొబైల్ వాలెట్ నుంచి ఇక ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా రైలు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
పేమెంట్ గేట్‌వే, సర్వీస్ చార్జీలను కూడా పేటీఎం రద్దు చేయడం విశేషం. యూజర్లు తమ పీఎన్‌ఆర్ స్టేటస్‌ను చూసుకోవడంతోపాటు టికెట్‌ను రద్దు చేసుకుంటే వెంటనే రీఫండ్ కోరే అవకాశం కల్పించింది.
ఐఆర్‌సీటీసీతో ఈ మధ్యే మరో మొబైల్ వాలెట్ ఫోన్‌పె ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో పేటీఎం తమ యూజర్లకు ఈ ఆఫర్ ఇస్తున్నది.
ఇప్పటివరకు పేటీఎం మొత్తం రైలు టికెట్ చార్జీలో పేమెంట్ గేట్‌వే ఫీజు కింద 1.8 శాతం వసూలు చేస్తున్నది. దీనికితోడు అదనపు చార్జీలు కూడా ఉండేవి.
వీటన్నింటినీ రద్దు చేసినట్లు పేటీఎం వైస్‌ప్రెసిడెంట్ అభిషేక్ రాజన్ చెప్పారు.

ట్రైన్ టికెట్  చేసుకునే విధానం 
Step 1
పేటీఎం యాప్ లోకి లాగిన్ అయి Train tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి

Step 2
Book Ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. ట్రైన్ ఎక్కవలసిన స్టేషన్ మరియు దిగవలసిన స్టేషను సెలెక్ట్ చేసుకుని ఏ రోజు వెళ్లాలో ఆ రోజును సెలెక్ట్ చేసుకుని సెర్చ్ ట్రైన్ ఆప్షన్ పై click చేయాలి.
Step 3
కావాల్సిన ట్రైన్ సెలెక్ట్ చేసుకుని అలాగే రిజర్వేషన్ టైప్ ను సెలెక్ట్ చేసుకుని సీటు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాలి..

ట్రైన్ PNR Status check చేయడం ఎలా ?

Step 1
పేటీఎం యాప్ లోకి లాగిన్ అయి Train tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి..

Step 2
PNR status  ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. 

Step 3
PNR Number ఎంట్రీ చేసి PNR యొక్క status ను తెలుసుకోవచ్చు...

Train status తెలుసుకోవడం ఎలా ?

Step 1
పేటీఎం యాప్ లోకి లాగిన్ అయి Train tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి..

Step 2
Train status పై క్లిక్ చేయాలి...
Step 3
Train number ఎంట్రీ చేసి ట్రైన్ యొక్క లైవ్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు....



థాంక్యూ,
మీ
అశోక్ చెలిక.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి